మోనిత చేయించిన హత్య గురించి ఆమె ముందే కార్తీక్కు చెప్పేసిన అంజి!
on Mar 8, 2021
'కార్తీక దీపం' కీలక దశకు చేరుకుంది. కార్తీక్ తనకు నిజం చెప్పే ఛాన్స్ ఇవ్వకపోవడం, సౌందర్య చెప్పిన మాటలు కూడా నమ్మకపోవడంతో ఇక లాభం లేదనుకున్న దీప తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని ఊరు వదిలి వెళ్లిపోతుంది. వారణాసి ఆటోలో వెళ్తున్న దీపకు అత్త సౌందర్య కనిపిస్తుంది... పిల్లలు నానమ్మా అంటారు.. కలవాలని దీపకు వున్నా వారణాసికి ఆటో పోనివ్వమని చెప్తుంది దీప. దీంతో ఆటో ముందుకు కదులుతుంది.
కట్ చేస్తే.. దీప గురించి ఆలోచిస్తూ కారులో వెళుతున్న కార్తీక్కి ఎదురుగా అంజి బైక్ పై వస్తూ కనిపిస్తాడు. అంజిని పిలిచి కారెక్కరించుకుని మోనిత ఇంటికి తీసుకెళతాడు కార్తీక్. మోనిత ముందు "ఇప్పడు నిజం చెప్పరా" అని బెదిరించడంతో అసలు నిజం మొత్తం చెప్పేస్తాడు అంజి. "నీకు మోనిత ఎలా తెలుసు? దీపకు ఏం చెప్పావ్? మా అమ్మకు ఏం చెప్పాలనుకున్నావ్? అన్నీ బయటపెట్టేయ్" అని అంజిని నిలదీయడంతో మోనిత చేయించిన హిమ హత్య గురించి చెప్పేస్తాడు అంజి. అది విన్నట్టే విని డాక్టర్ బాబు, "ఇలా దీప నీతో కథలు చెప్పిస్తోందా?" అని షాకిస్తాడు. అది కాదని అంజి ఎంత చెప్పినా పట్టించుకోకుండా బయటికి నెట్టేస్తాడు.
అంజి చెప్పింది కార్తీక్ నమ్మకపోవడంతో మోనిత ఊపిరి పీల్చుకుంటుంది. కపట నాటకం ఆడుతూ కార్తీక్ గుండెలపై వాలి "ఇప్పడు అర్థమైందా నా వెనక ఎంత భయంకరమైన కుట్ర జరుగుతోందో?".. అని కపటప్రేమని ఒలకబోస్తూ వుంటుంది. ఈ యాక్టింగ్ కి కరిగిపోయిన కార్తీక్ "ఊరుకో మోనితా ఊరుకో" అని మోనితని ఓదారుస్తాడు. సోమవారం ఈ ఎపిసోడ్ స్టార్ మాలో ప్రసారం కానుంది.